ఫీజు బకాయిలు విడుదల చేయాలి

లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం ఎస్ఎఫ్ఐ కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ బ్యూరో : రూ.8వేల కోట్లకు పైగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయ‌ని విద్యార్థులు, కళాశాలల యజమానులు ఇబ్బందులకు గుర‌వుతున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు కాంపెల్లి అర‌వింద్‌, గ‌జ్జెల శ్రీ‌కాంత్ అన్నారు. గురువారం భారత విద్యార్థి ఫెడ‌రేష‌న్ (ఎస్ఎఫ్ఐ) క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పెండింగ్ ఉన్న స్కాల‌ర్షిప్, ఫీజు రీయింబ‌ర్మ్సెంట్ బకాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వ‌ద్ద ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ‌తో శ‌వ‌యాత్ర...