ప్రజలకు భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు
ప్రజలకు భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తుంబూరు దయాకర్ రెడ్డి కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పిస్తూ సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వం అందజేసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 54 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి...