జమ్మూ కాశ్మీర్లోని దోడాలో క్లౌడ్ బరస్ట్..విరిగిపడిన కొండచరియలు..భారీ ట్రాఫిక్ జామ్..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం దోడా జిల్లాలోని భలేషా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయినట్లు అధికారులు తెలిపారు. దీని కారణంగా జనజీవనం అంతరాయం కలిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH-44) పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటం, రాళ్ళు కూలిపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాంబన్లోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH-44)పై మంగళవారం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా, అనేక...