మీ సేవ సెంట‌ర్ల‌లో త‌నిఖీలు: ములుగు డిస్ట్రిక్ మేనేజ‌ర్ దేవేంద‌ర్‌

కాక‌తీయ‌, ములుగు : మల్లంపల్లి మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాలను ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాలను ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండి ఈఏస్‌డీ గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని న‌డ‌పాల‌ని సూచించారు. ఆపరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ, భూభారతి త‌దిత‌ర ఆన్లైన్ సర్వీస్ లను ప్రజలకు అందించాలని సూచించారు. సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చార్ట‌ర్ తప్పనిసరిగా ఉండాల‌ని ఆదేశించారు. మండల ప్రజలు ఆధార్ సేవల గురించి ఇబ్బందులు పడుతున్న విషయమై...