`గ్రేటర్`కు మహిళా మార్ట్ : వరంగల్ మేయర్ గుండు సుధారాణి
కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ నగరం లోని కాశీబుగ్గ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ను గురువారం కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి మేయర్ గుండు సుధారాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయానికి మార్ట్ ఏర్పాటు చేయనున్నట్లు వెళ్లడించారు. పనుల వేగవంతానికి క్షేత్ర స్థాయి లో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోటి మంది మహిళలకు కొటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగా...