తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపిద్దాం: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ : నిఖార్సైన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తోడు నిలుద్దామని, భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆత్మప్రబోధానుసారం ఓటు వేసి ఆయన్ను గెలిపిద్దామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగు రాజకీయ నాయకుల హవా...