ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం..!!
కాకతీయ, హుజురాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడంతో జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. హుజురాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయి మాట్లడుతూ.. పేదల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. దినసరి అవసరాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో జీవన వ్యయం తగ్గనుందని, పేద కుటుంబాలకు ఇది నిజమైన పండుగ బహుమతిగా...