దీపిక ఆసుప‌త్రి ముందు డీవైఏఫ్ఐ, ఏఐవైఎఫ్ గిరిజ‌న సంఘం నాయ‌కుల ధ‌ర్నా .. !!

కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ః- దీపిక హాస్ప‌ట‌ల్‌ను మూసివేసి ఆస్ప‌త్రి నిర్వ‌హ‌కుల‌పై వెంట‌నే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ గిరిజన సంఘాల నాయ‌కులు డిమాండ్ చేశారు. వైద్యం కోసం వచ్చిన మ‌హిళ‌కు మ‌త్తు ఇచ్చి అత్యాచారం చేసిన కౌంపౌండ‌ర్, ఆసుప‌త్రి నిర్వ‌హ‌కుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు సోమ‌వారం రోజున క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని దీపిక ఆసుప‌త్రి ముందు ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయ‌కులు భీమా సాహెబ్, తిరుప‌తి, యుగంద‌ర్‌, రాజు నాయ‌క్‌లు మాట్ల‌డుతూ.....