సంగెం కాలువ ఒడ్డు మీద మొసలి ప్రత్యక్షం ..!!
కాకతీయ, నర్సంపేట: ఖానాపురం మండలం పాకాల ఆయకట్టు బండమీది మామిడి తండా ఊరు చివరన మంగళవారం రాజు అనే రైతు వ్యవసాయ భూమి దగ్గరలో సంగెం కాలువ ఒడ్డుకు మొసలి రాగ అటుగా పొలం పనులకు వెళ్లిన రైతులు సెల్ ఫోన్ లలో చిత్రికరించారు. దీంతో రైతుల అలికిడి విన్న మోసలి మళ్ళీ కాలువ లోకి వెళ్ళింది. వ్యవసాయ పనుల నిమిత్తం పంట చేనుల దగ్గరికి వెళ్లే పాకాల ఆయకట్టు రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు.