వ్యక్తి దారుణ హత్య..!!

కాకతీయ, వేములవాడ: వేములవాడ పట్టణంలోని నంది కమాన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు సిరిగిరి రమేష్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.