సింగరేణిని దివాళా తీయించే కుట్ర
గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాకతీయ, తెలంగాణ బ్యూరో, శ్రీరాంపూర్ : సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... సింగరేణి విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల ఒక్కో కార్మికుడికి లక్ష నష్టం వాటిల్లుతోందని, సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర...