పాక్‌కు వ్యతిరేకంగా పీవోకేలో నిరసనలు..

పెద్ద సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించిన ప్ర‌భుత్వం ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. పీవోకేలో ప్రధాని షెహ్‌బాబ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలు కోరుతూ అవామీ యాక్షన్‌ కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. పాక్ ప్ర‌భుత్వం త‌మ‌ను ద‌శాబ్దాలుగా రాజ‌కీయంగా, ఆర్థికంగా అణ‌గ‌దొక్కుతున్న‌ద‌ని మండిప‌డ్డారు. 70 ఏళ్ల‌కు పైగా పీవోకేలో త‌మ‌కు ప్రాథ‌మిక హ‌క్కులు కూడా క‌ల్పంచ‌లేదని వారు తీవ్ర...