పౌరాణిక శాస్త్రాలు, గాథలు యాప్ లో పొందుపర్చడం అభినందనీయం

పురాణ నిధి యాప్, ఆపరేషన్ సిందూర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన బండి సంజ‌య్‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా అందించేందుకు రూపొందించిన పురాణ నిధి యాప్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగ‌ళ‌వారం ఆవిష్కరించారు. విజయ దశమి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా కరీంనగర్ లో పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, గణేశ్ నగర్ శివాలయ ప్రధాన అర్చకులు పురాణం మహేశ్వర శర్మ మౌన వ్రతం చేపట్టడం, వారి నివాసాలకు వెళ్లి...