Bathukamma: బతుకమ్మ పాటల పల్లకి పుస్తక ఆవిష్కరించిన కేంద్ర హోం శాఖ స‌హ‌య మంత్రి బండి సంజ‌య్‌..!!

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్‌ : కరీంనగర్ కు చెందిన‌ అనంతోజు పద్మ శ్రీ రచించిన బతుకమ్మ పాటల పల్లకి పుస్తకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగ‌ళ‌వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ జానపదుల హృదయ స్పందనను పాటల రూపంలో అక్షరబద్ధం చేసిన పద్మ శ్రీ ని అభినందించారు. ఆమె రచనలో తెలంగాణ ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్నాయ‌ని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సాహిత్య సృష్టులు వెలువరించాలని బండి సంజ‌య్ తెలిపారు.