స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కలెక్టర్

కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. పెద్దపల్లి మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి జేఎన్టీయూ, మంథని ఇంజనీరింగ్ కళాశాల, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను క‌లెక్ట‌ర్ కోయ శ్రీ హ‌ర్ష‌ అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల బ్యాలెట్ బాక్సులు...