మోసకారి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం ఇంటింటా బాకీ కార్డులతో ప్రజలకు అవగాహన ములుగు నియోజకవర్గ ఇన్ చార్జి బడే నాగజ్యోతి కాకతీయ, ములుగు ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శక్తిని మరోసారి చాటుకోవాలని, మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు. గోవిందరావుపేట మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ...