పథకాల బాకీ తీర్చాకే ఓట్లు అడగమనండి
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కాకతీయ, మంథని : అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బాకీకార్డును గడపగడపకు అందిస్తూ అవగాహన కల్పించారు. వంద రోజుల్లో ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చుతామంటూ 22నెలలైనా ఒక్క హమీ నెరవేర్చకుండా మోసం చేశారని అన్నారు....