పత్తి, మొక్కజొన్నకొనుగోళ్లలో షరతులు వద్దు
రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు కాకతీయ, వరంగల్ : పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై ఎలాంటి షరతులు పెట్టకుండా మొత్తం పంటలను సిసిఐ, మార్క్ ఫైడ్ ద్వారా కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం చందర్రావు మాట్లాడుతూ డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం సీటు ప్లస్ 50శాతం అదనపు ధరలు చెల్లించేలా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ వ్యవసాయ...