బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీల కు 42శాతం రిజర్వేషన్ల పిటిషన్ పై విచారణ జరిగింది. వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగా..సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేశారంటూ మందలించింది.