పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారికి తల్లిదండ్రుల వినతి కాకతీయ, హుజురాబాద్ : జమ్మికుంట మండలంలో పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు, పెండింగ్లో ఉన్న ఫీజుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలంటూ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ తమ పిల్లలు వివిధ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతుండగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వాయిదా పడటంతో పాఠశాల యాజమాన్యాలు తమ పిల్లలను తరగతులకు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు తరగతులకు హాజరు...