31 పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమ కేసులు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కారణం ఏంటో చెప్పాలని డీజీపీకి లేఖ కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్లో తన మీద పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బయటపెట్టారు. అక్రమ కేసులను నమోదు చేయడానికి గల కారణం ఏంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. మధ్య ప్రదేశ్లో జరిగిన ఓ హిందూ సభలో తాను మాట్లాడిన మాటలను పోలీసులు వక్రీకరించి కేసు నమోదు చేసారని ఫిర్యాదు చేశారు. హైరాదాబాద్ సిటీకి సంబంధం లేకుండా కేసు ఎలా పెడతారని లేఖలో...