కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు వేయాలి: ఏఐఎఫ్ బీ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి పైన రోడ్డు వేయకపోవడం, సరైన లైటింగ్ ఏర్పాటు లేకపోవడంతో తీవ్రంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఏఫ్బీ) కరీంనగర్ జిల్లా కమిటీ విమర్శించింది. ఇప్పటివరకు 15 ఆక్సిడెంట్లు జరిగాయని, ఈ ప్రమాదాలలో ముగ్గురు చనిపోయారని ఈ విషయంలో ముగ్గురు మంత్రులు, అధికారులు, నగరపాలక సంస్థ బాధ్యత ఉన్నదని ఏఐఏఫ్బీ జిల్లా కమిటీ ఆరోపించింది. పార్టీ ఆధ్వర్యంలో కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు వేయడం, హైమాస్టు లైటింగ్ ఏర్పాటు చేయడం, చౌరస్తా సుందరీకరణ చేపట్టడం...