నేతల అభిప్రాయంతోనే డీసీసీ అధ్యక్షుల నియామకం
సమన్వయంతో ముందుకు సాగాలి భవిష్యత్లో మండల కమిటీల్లోనూ ఇదే విధానం కరీంనగర్ జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ మానే శ్రీనివాస్ కాకతీయ, హుజురాబాద్ : గ్రామ స్థాయి మొదలు అన్ని స్థాయిల నాయకుల అభిప్రాయం తీసుకునే డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుందని కరీంనగర్ జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ మానే శ్రీనివాస్ తెలిపారు. గురువారం హుజురాబాద్లో ప్రతాప సాయి రెడ్డి ఫంక్షన్ హాల్ లో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే...