అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో దీపావళి వేడుకలు

ఆక‌ట్టుకున్న విద్యార్థ‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు కాకతీయ, కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో విద్యార్థుల‌తో ముందస్తుగా దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భంగా ఈ పండుగను భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రతి ఇంటిలో ఆనందోత్సాహంగా జరుపుకుంటారని తెలిపారు. కార్యక్రమానికి ముందు శ్రీ మహాలక్ష్మి మాత...