కోతుల బారి నుంచి కాపాడాలి
ములుగు అటవీశాఖ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా కాకతీయ, ములుగు ప్రతినిధి : కోతుల బారి నుంచి ప్రజలను, పంట పొలాలను రక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అటవీ శాఖ రేంజర్ శంకర్ కు ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రత్నం రాజేందర్ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా ములుగు జిల్లా వ్యాప్తంగా కోతుల బెడద తీవ్రంగా పెరిగిపోయిందన్నారు....