రిమాండ్కు యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ
రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రామారావు అవినీతి ఆరోపణలతో గతంలోనూ సస్పెన్షన్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు రామారావును ఏసీబీ అధికారులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. ప్రసాదాల మెషీన్ల మెయింటెనెన్స్ బిల్లుగా రూ.11.50 లక్షలు రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ నుంచి 20 శాతం కమీషన్ కోరాడు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి మెడ్ప్లస్ వద్ద రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ టీం అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర ఆధ్వర్యంలో...