పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడి ఆత్మ హత్యాయత్నం
సూసైడ్ నోట్లో అధికారుల పేర్లు తన భూమి నుంచి అక్రమంగా సీసీ రోడ్డు వేశారని ఆవేదన ‘ప్రజాప్రతినిధి’ సిఫారసుతోనే ప్రైవేటు రోడ్డు..? కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడు ఆత్మ హత్యాయత్నం చేశాడు. మహబూబాబాద్ మండలం మాదపురం గ్రామానికి చెందిన కంబాల సంపత్ అనే యువకుడు పోలీసుల వేధింపులు, నిర్బంధం తట్టుకోలేక పురుగుల మందు తాగుతున్నట్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే..అతడు తాతల కాలం నుంచి సాగుచేసుకుంటూ వస్తున్న పూర్వీకుల వ్యవసాయ భూమి నుంచి...