రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థిని

కాకతీయ, లక్షెట్టిపేట :ఈ నెల 3న ఆదిలాబాద్ లో నిర్వహించిన జోనల్ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో హనీషా ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ రమా కళ్యాణి బుధవారం తెలిపారు. అండర్ 17 విభాగంలో ఈ నెల 7 నుంచి 9 వరకు మహబూబ్ నగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుదన్నారు. హనీషా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థలు అభినందించారు.