అద్దె చెల్లించలేదు.. ప్రభుత్వ పాఠశాలకు తాళం..!
అద్దె చెల్లించలేదు.. ప్రభుత్వ పాఠశాలకు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాకతీయ, వెబ్డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల భవనానికి యజమాని తాళం వేశాడు. ఈ సంఘటనం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో జరిగింది. ప్రభుత్వ పాఠశాలను అద్దె భవనంలో నడుపుతుండగా.. నెలలుగా గడిచినా అద్దె మంజూరు కావడం లేదని పేర్కొంటూ యజమాని సోమవారం భవనానికి తాళం వేశాడు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.