ఖమ్మం సైన్స్ మ్యూజియం తెరవాలి
సర్కార్ నిధులు, సీఎస్ఆర్ ఫండ్స్ వృథా పీడీఎస్యూ డిమాండ్ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతి కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియం రెండు సంవత్సరాలుగా మూతపడిఉంటోందని, వెంటనే తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సాధిక్ పాషా, యశ్వంత్ కుమార్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యార్థుల ప్రయోగాత్మక బోధన కోసం కొనుగోలు చేసిన పరికరాలు వాడకం లేక తుప్పుపడి పనికిరాకుండా పోతున్నాయని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారుల పై వారు...