ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. క‌ళాశాలపైనే అనుమానం

ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. క‌ళాశాలపైనే అనుమానం మ‌డికొండ పీఎస్‌లో తండ్రి ఫిర్యాదు.. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు కాకతీయ, హనుమకొండ : హ‌న్మ‌కొండ జిల్లా కాజీపేట మండ‌లంలోని మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భ‌ట్టుపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ క‌ళాశాల నుంచి విద్యార్థి అదృశ్య‌మ‌య్యాడు. ఆత్మ‌కూరు మండ‌లం గూడెప్పాడు గ్రామానికి చెందిన ర‌వీంద‌ర్‌రెడ్డి కుమారుడైన శివరాం రెడ్డి ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం సీఈసీ చ‌దువుతున్నాడు. ఈక్ర‌మంలోనే బుధ‌వారం క‌ళాశాలకు వెళ్లిన కుమారుడు తిరిగి ఇంటికి చేరుకోక‌పోవ‌డంతో గురువారం మ‌ధ్యాహ్నం మ‌డికొండ పీఎస్లో ర‌వీంద‌ర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు....