మేడారం జాతరను విజయవంతం చేద్దాం
మేడారం జాతరను విజయవంతం చేద్దాం అధికారులు సమన్వయంతో పనిచేయాలి ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ కాకతీయ, ములుగు ప్రతినిధి : రాబోయే జనవరి 28న ప్రారంభమై 31 వరకు జరగనున్న మహా మేడారం జాతరను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో పాత్రికేయులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతర సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున మరింత పురోగతిశీల ప్రణాళికను...