ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

ఎన్నికలకు పటిష్ట బందోబస్తు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్‌ 14న జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. శ‌నివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన ఎన్నికల బందోబస్తు వివరాలను వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో రెండవ విడత పోలింగ్ జరగనుందని తెలిపారు. ఈ...