తీగల వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలి

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఆర్జేసీ కృష్ణ డిమాండ్ ఖమ్మం, కాకతీయ ప్రతినిధి: ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌ ప్రాంతంలో కాల్వ ఒడ్డున మున్నేరుపై నిర్మిస్తున్న తీగల వంతెన పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు గుండాల (ఆర్జేసీ) కృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం త్రీటౌన్‌లో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరైన వంతెన నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాకపోవడం శోచనీయమన్నారు. వంతెన పనులు నిలిచిపోవడంతో ప్రజలు...