రోడ్లపై ఉన్న దుకాణాల తొలగింపు
రోడ్లపై ఉన్న దుకాణాల తొలగింపు మేడారంలో భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఎస్పీ చర్యలు కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో రహదారులపై ఆక్రమణకు గురైన దుకాణాల తొలగింపునకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం రాత్రి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా పోలీస్ అధికారి కేకన్ సుధీర్ రామనాథ్లు సమన్వయంతో స్వయంగా రంగంలోకి దిగారు. జాతర సమయంలో భారీ జనసందోహం ఏర్పడుతుందని, భక్తుల సురక్షిత రాకపోకలు, వాహనాల సాఫీగా...