డేంజర్ స్పాట్‌గా రైల్వే అండర్‌బ్రిడ్జి

డేంజర్ స్పాట్‌గా రైల్వే అండర్‌బ్రిడ్జి రహదారి మధ్యలో భారీ గుంతలు బయటకు లేచిన ఐరన్ చువ్వలు నిత్యం వాహనదారులకు ముప్పు కొత్త‌గూడెంలో ఆర్యూబీని ఎవ‌రు ప‌ట్టించుకోరా..?! కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వాహనదారులకు డేంజర్ స్పాట్‌గా మారింది. అండర్ బ్రిడ్జి రహదారి మధ్యలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రమాదం పొంచి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా రహదారిపై కంకర పూర్తిగా లేచి, లోతైన గుంతలు ఏర్పడిన పరిస్థితి నెలకొంది....