మేడారంలో నలుగురి మృతి
మేడారంలో నలుగురి మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు కాకతీయ, మేడారం బృందం : మేడారం జాతరలో గురువారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతర ప్రాంగణంలో అస్వస్థతకు గురైన భక్తులను ప్రధాన మెడికల్ క్యాంప్కు తరలించే క్రమంలో నలుగురు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జగన్నగూడెం గ్రామానికి చెందిన సిద్ధగోని శంకర్ గౌడ్ (50) జనవరి 28న రాత్రి 8.40 గంటలకు మృతి చెందారు. మద్యం అతిగా సేవించడంతో హైదరాబాద్ అల్వాల్కు చెందిన...