పోలింగ్ సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్ పూర్తి

పోలింగ్ సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్ పూర్తి నర్సంపేట–వర్ధన్నపేట ఎన్నికలకు 400 మంది సిబ్బంది కేటాయింపు పారదర్శక పోలింగ్‌కు స్థానికేతర సిబ్బంది ఎంపిక కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జనరల్ అబ్జర్వర్ కిల్లు శివకుమార్ నాయుడు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ర్యాండమైజేషన్ నిర్వహించగా, కలెక్టర్‌, జనరల్...