బ్యాంకింగ్పై విద్యార్థులకు అవగాహన
బ్యాంకింగ్పై విద్యార్థులకు అవగాహన జమ్మికుంట ఎస్బీఐ బ్యాంకును సందర్శించిన వోక్సపోప్ పాఠశాల విద్యార్థులు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని వోక్సపోప్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన పెంపొందించుకునేందుకు ఎస్బీఐ బ్యాంకును సందర్శించారు. 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులతో ఈ వినూత్న అవగాహన కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంకులో జరిగే నగదు లావాదేవీలు, ఖాతాలు తెరవడం, నగదు బదిలీ విధానం, రుణ సదుపాయాలు తదితర బ్యాంక్ సేవలపై విద్యార్థులకు వివరించారు. బ్యాంక్ సేవలు...