వ్యాస‌ర‌చ‌న పోటీల‌కు ద‌ర‌ఖాస్తులు

వ్యాస‌ర‌చ‌న పోటీల‌కు ద‌ర‌ఖాస్తులు కాకతీయ, జమ్మికుంట : ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లల్లోని 9 నుండి 15 సంవత్సరాల వయస్సు గ‌ల విద్యార్థులకు అంతర్జాతీయ తపాలా లేఖ రచనా పోటీలను నిర్వహిస్తున్నారు. “సాంకేతిక ప్రపంచంలో మానవ సంబంధాలు ఎందుకు? ”అనే అంశంపై పోటీ పరీక్ష నిర్వ‌హించ‌నున్నారు. పూర్తి వివరాలకు జమ్మికుంట తపాలా కార్యాలయాన్ని గాని దగ్గరలోని తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని జమ్మికుంట పోస్ట్ మాస్టర్ మహేందర్ కోరారు.