జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన
జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన కుల బహిష్కరణ బాధితుడి అంత్యక్రియలకు పాడెమోయని గ్రామస్తులు కాకతీయ, జగిత్యాల: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్తులు ముందుకు రాకపోవడం తీవ్ర కలకలం రేపింది. కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశాన్ని కొంతకాలంగా కుల బహిష్కరణకు గురిచేసిన పెద్దలు అతను మృతి చెందడంతో పాడె మోయకూడదని గ్రామ సర్పంచ్తోపాటు కులపెద్దలు ఆజ్ఞాపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు మాత్రమే కాకుండా దూరపు చుట్టాలు...