ప్రజావాణిలో వినతుల వెల్లువ
ప్రజావాణిలో వినతుల వెల్లువ ఉమ్మడి జిల్లాలో సమస్యలపై అధికారుల ఫోకస్ నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని కలెక్టర్ల ఆదేశాలు కాకతీయ, కరీంనగర్/పెద్దపల్లి /జగిత్యాల /రాజన్న సిరిసిల్ల : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్కు భారీగా ప్రజలు తరలివచ్చి తమ వినతులను అధికారుల ముందుంచారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్వయంగా అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలపై కఠిన ఆదేశాలు...