హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు
హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు కోర్టు కేసులున్నా నిర్మాణాలు ప్రగతినగర్ స్మశానవాటికను కాపాడాలంటూ విన్నపాలు కాకతీయ,తెలంగాణ బ్యూరో : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రజావసరాలకు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు సమర్పించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధుల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్లో ప్రజావసరాల కోసం కేటాయించిన సుమారు 5 ఎకరాల శ్మశానవాటిక స్థలం...