క్రికెట్ టోర్నీ విజేత‌గా ఇల్లందు సీసీఎల్ జట్టు

క్రికెట్ టోర్నీ విజేత‌గా ఇల్లందు సీసీఎల్ జట్టు యాకుబ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వంశీకి సిరీస్ అవార్డు కాకతీయ, కారేపల్లి : గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో ఇలాంటి టోర్నమెంట్‌లు కీలకమని సర్పంచ్ వరలక్ష్మి రాజు పేర్కొన్నారు. ఉసిరికాయలపల్లి గ్రామంలో యువత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా ముగిసింది. తుది పోటీలో ఇల్లందు సీసీఎల్ జట్టు విజేతగా నిలవగా, ఉసిరికాయలపల్లి జట్టు రన్నరప్‌గా నిలిచింది. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యాకుబ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మొత్తం టోర్నమెంట్‌లో...