శంకరపట్నంలో మిన్నంటిన బీఆర్‌ఎస్‌ వేడుకలు

శంకరపట్నంలో మిన్నంటిన బీఆర్‌ఎస్‌ వేడుకలు ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కేక్‌ కట్‌ చేసి ఆనందం పంచుకున్న కార్యకర్తలు కాకతీయ, శంకరపట్నం: మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, జై తెలంగాణ.. జై జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.....