కరీంనగర్ కాంగ్రెస్‌లో ‘వర్గ’ పోరు

కరీంనగర్ కాంగ్రెస్‌లో ‘వర్గ’ పోరు డీసీసీ అధ్యక్షుడి ముందే కుమ్ములాట! కార్పొరేషన్ టికెట్ల కేటాయింపుపై సీనియర్ల ఆగ్రహం వేదికపైనే పరస్పర ఆరోపణలు.. ఉద్రిక్తత సర్దిచెప్పేందుకు మేడిపల్లి సత్యం విఫ‌ల‌య‌త్నం కాక‌తీయ‌, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో గూడుకట్టుకున్న విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అధ్యక్షతన జరిగిన తొలి సమావేశమే వర్గపోరుకు వేదికైంది. నాయకుల సమక్షంలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం కలకలం రేపింది....