మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలి
మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు కాకతీయ, హైదరాబాద్ : మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జూన్ 6న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. బీఆర్ఎస్ మలేషియా మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సంయుక్త ఆధ్వర్యంలో కౌలాలంపూర్లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్...