పట్టాలున్నా పాస్బుక్కులు లేవు!
పట్టాలున్నా పాస్బుక్కులు లేవు! పోడు రైతుల తీవ్ర ఆవేదన బ్యాంకు రుణాలు రాక, అటవీశాఖతో తప్పని ఇబ్బందులు ఐటీడీఏ ఏపీఓకు గిరిజన సంఘం వినతిపత్రం కాకతీయ, ఏటూరునాగారం : ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరై ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నప్పటికీ, ఇప్పటివరకు చేతికి పట్టా పాస్బుక్కులు జారీ కాకపోవడంతో పోడు సాగు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే పాస్బుక్కులు అందించకపోతే ఆందోళనలకు దిగుతామని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి హెచ్చరించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఏటూరునాగారం...