ముక్కిపోతున్న వడ్లు.. పట్టించుకోని పాలకులు
ముక్కిపోతున్న వడ్లు.. పట్టించుకోని పాలకులు 40 రోజులుగా కొనుగోళ్ల కోసం రైతుల నిరీక్షణ ప్రజాపాలన పేరుతో అన్నదాతలతో చెలగాటమా? బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు కాకతీయ, ఏటూరునాగారం : కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కుప్పలుగా పేరుకుపోతున్నా, అకాల వర్షాలకు తడిసి నాణ్యత కోల్పోతున్నా, రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పాలకులు, అధికారులు స్పందించడం లేదని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు మండిపడ్డారు. రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్నదాతలను అగచాట్లకు గురిచేస్తోందని విమర్శించారు. శుక్రవారం ఏటూరునాగారం...