మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య కన్నుమూత * 1978లో 7,056 ఓట్ల మెజారిటీతో ఘన విజయం * 95 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో తుదిశ్వాస కాకతీయ,చేర్యాల: పూర్వపు చేర్యాల నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య (95) కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సిద్దయ్య మృతి వార్తతో కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు, చేర్యాల ప్రాంత ప్రజల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 7,056...